అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన.. కీలక ప్రకటన
గతంలో అమరావతి రాజధానికి భూములు ఇవ్వని రైతులు ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారని చెప్పారు.

Narayana
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఆదివారం అమరావతిలో పర్యటించారు. ఎర్రబాలెంలో భూములు ఇచ్చిన రైతుల ఇళ్ల వద్దకు నారాయణ వెళ్లారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి ఎర్రబాలెం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. గతంలో అమరావతి రాజధానికి భూములు ఇవ్వని రైతులు ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారని చెప్పారు. భూములు ఇచ్చే రైతుల ఇంటికి నేరుగా తానే వస్తానని చెప్పానని అన్నారు. అప్పట్లో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్స్ ఇచ్చామని, ఇప్పుడు కొంత మేర భూములు మాత్రమే అవసరమని తెలిపారు.
ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు బహిరంగ ఆఫర్ ఇస్తున్నామని, వారికి కావాల్సిన చోట, ఎక్కడ భూమి ఉందో అక్కడ వారు కోరుకున్న చోట ఫ్లాట్స్ ఇవ్వనున్నామని తెలిపారు. అలాగే, రైతులకు అందాల్సిన రెండు వార్షిక కౌలును అందిస్తామని చెప్పారు. ముందుగా ఒక కౌలును త్వరలోనే అందిస్తామని అన్నారు. గత వైసీపీ సర్కారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అపహస్యం చేసిందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రజలు రెండు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు.. ఆ వరదలు ఇవే: హరీశ్ రావు