Roja : భువనేశ్వరి కూడా జైలుకి వెళ్లే అవకాశం, చంద్రబాబు జీవితాంతం జైల్లోనే- మరో బాంబు పేల్చిన మంత్రి రోజా

2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. నిజం గెలవాలని భువనేశ్వరి తిరుమల వచ్చి గట్టిగా పూజలు చేసినట్టు ఉన్నారు. Roja

Roja : భువనేశ్వరి కూడా జైలుకి వెళ్లే అవకాశం, చంద్రబాబు జీవితాంతం జైల్లోనే- మరో బాంబు పేల్చిన మంత్రి రోజా

Roja On Nara Bhuvaneswari

Roja On Nara Bhuvaneswari : వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి మంత్రి రోజా చంద్రబాబు సతీమణి భునవేశ్వరిని టార్గెట్ చేశారు. భువనేశ్వరి చేపట్టబోయే ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. భువనేశ్వరి, లోకేశ్ కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉందన్నారు రోజా.

నిజం గెలిస్తే జీవితాంతం జైల్లోనే..
చంద్రబాబు కేసులో నిజం గెలవాలనే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉంటారని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు నారా లోకేశ్, భువనేశ్వరి కూడా జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని బాంబు పేల్చారు మంత్రి రోజా. నిజం గెలవాలని భువనేశ్వరికి ఉంటే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. మంత్రి రోజా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంపై స్పందించిన మంత్రి రోజా.. చంద్రబాబు ఎప్పటికీ జైల్లోనే ఉండాలని భువనేశ్వరి ఆ వెంకన్నను ప్రార్థించినట్టున్నారు అంటూ సెటైర్ వేశారు.

Also Read : వైసీపీ తెగులుకు జనసేన-టీడీపీ వాక్సినే సరైందన్న పవన్ కల్యాణ్.. ఎన్డీయేతో దోస్తీపై హాట్ కామెంట్స్

మళ్లీ జగనే సీఎం..
చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ నారా భువనేశ్వరి రేపటి (అక్టోబర్ 25) నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. భువనేశ్వరి బస్సు యాత్రను ఉద్దేశించి మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ‘నిజం గెలవాలని భువనేశ్వరి తిరుమల వచ్చి ఆ దేవుడికి గట్టిగా పూజలు చేసినట్టు ఉన్నారు. మేము కూడా నిజమే గెలవాలని కోరుకుంటున్నాము. నిజం గెలవాలి. నిజం గెలిస్తే చంద్రబాబు జీవితకాలం జైల్లోనే ఉంటారు. నిజం గెలవాలని భువనేశ్వరి చిత్తశుద్ధితో గనుక ఆలోచిస్తే ఆమె సీబీఐ విచారణ కోరాలి. చంద్రబాబుతో పాటు లోకేశ్, భువనేశ్వరి కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉంది. 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు ఫిక్స్ అయ్యారు” అని మంత్రి రోజా అన్నారు.

నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్ర..
భువనేశ్వరి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో రేపటి(అక్టోబర్ 25) నుంచి మూడు రోజుల పాటు బస్సు యాత్రను చేపట్టనున్నారు భువనేశ్వరి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ప్రతి వారం మూడు రోజుల పాటు ఆమె ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. బుధవారం చంద్రగిరిలో యాత్ర ప్రారంభం కానుంది.

Also Read : టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయి