AP Floods : సీఎం జగన్కి ఫోన్ చేసిన పీఎం మోదీ
ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
AP Floods : ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల దాటికి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాయలసీమ, నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. ఇక కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో 50 మందికిపైగా గల్లంతయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ సీఎం జగన్కు ఫోన్ చేశారు.
చదవండి : Tirumala : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు తొలగింపు.. వాహనాలకు అనుమతి
రాష్ట్రంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
చదవండి : CM Jagan : కుటుంబానికి రూ.5లక్షలు, వరద పరిహారం ప్రకటించిన సీఎం జగన్