వైసీపీలో చేరిన మాజీ మంత్రి : ప్రకాశం జిల్లా టీడీపీకి మరో షాక్
ప్రకాశం జిల్లాలోటీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీ లో చేరిన సందర్భంగా శిద్ధా రాఘవరావు విలేకరులతో మాట్లాడుతూ…. ‘ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరాను. సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలు అనేకమంది లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నా’ అన్నారు.
Read: షెడ్యూల్ ప్రకారమే జూలై 10 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు