Rare Cow Calf : అద్దె గర్భం ద్వారా అరుదైన సాహివ్రాల్ ఆవు దూడ జననం.. ఏపీలో ఇదే మొదటి ప్రయోగం

దేశీయ ఆవులు అంతరించి పోతున్న నేపథ్యం లో వీటిని అభివృధి చేస్తున్నామని వెల్లడించారు. 11 ఆవులకు ఎంబ్రియో ఆవులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

Rare Cow Calf : అద్దె గర్భం ద్వారా అరుదైన సాహివ్రాల్ ఆవు దూడ జననం.. ఏపీలో ఇదే మొదటి ప్రయోగం

Rare cow calf

SV Veterinary University : తిరుపతిలో అద్దె గర్భం ద్వారా అరుదైన సాహివ్రాల్ ఆవు దూడ జన్మించింది. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు ఘనత సాధించారు. ఏపీలో ఇదే మొదటి ప్రయోగం. అరుదైన ఆవు దూడను టీటీడీ ఈవో ధర్మారెడ్డి సందర్శించారు. అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. సరోగేటివ్ తల్లి ఆవు ద్వారా ఆవు దూడ జన్మించిందని తెలిపారు. ఏపీలో ఇది మొట్టమొదటిదని పేర్కొన్నారు. దీనికి పద్మావతి గా నామకరణం చేశామని వెల్లడించారు.

గిర్ ఆవు పిండంను ఒంగోలు ఆవు గర్భంలో ప్రవేశ పెట్టారని తెలిపారు. సాహివాల్ ఎంబ్రీయోను ఒంగోలు జాతి ఆవులో అభివృధ్ది చేశామని చెప్పారు. దేశీయ ఆవు పాల ఉత్పత్తి లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని టీటీడీ ప్రోత్సహించి, వర్సిటీకి నిధులు ఇచ్చిందన్నారు. స్వామి, అమ్మవార్లకు దేశీయ ఆవు పాలతో ప్రసాదాలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Gidugu Rudra Raju : సోనియాగాంధీని చెడుగా చూపిస్తే బట్టలు ఊడదీసి కొడుతాం.. రాంగోపాల్ వర్మకు గిడుగు రుద్రరాజు వార్నింగ్

దేశీయ ఆవులు అంతరించి పోతున్న నేపథ్యం లో వీటిని అభివృధి చేస్తున్నామని వెల్లడించారు. 11 ఆవులకు ఎంబ్రియో ఆవులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఏడాదికి 94 సరోగేటివ్ ఆవు దూడలు పుట్టించేందుకు సిద్ధం చేశామని పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో రోజుకు 60 కిలోల నెయ్యి అవసరం ఉందన్నారు. 40 లీటర్ల పాలకు ఒక కిలో నెయ్యి వస్తుందని తెలిపారు.

రోజుకు 2500 లీటర్ల పాలు అవసరం కాగా, ఇందులో రోజుకు 500 దేశీయ ఆవుపాలు అవసరం ఉందని వెల్లడించారు. ఐదు మంది దాతలు 500 ఆవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
రామమయం ట్రస్టు 100 ఆవులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ 70 ఆవులు డొనేషన్ గా ఇచ్చారని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో టీటీడీ గోశాలలో వెయ్యి ఆవుల్ని సిద్ధం చేసి శ్రీవారి ఆలయం, అమ్మవారి ఆలయం అవసరం మేరకు వినియోగిస్తామని తెలిపారు.

Pawan Kalyan : వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదు : పవన్ కళ్యాణ్

గో ఆధారిత పశుగ్రాసం తయారు చేసేందుకు జిల్లా రైతులకు అవకాశం ఇస్తామని చెప్పారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ స్వదేశీ అవుల సంతతి పెంచుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఐవీఈ టెక్నాలజీ ద్వారా ఒక ఆవు నుంచి 10 నుంచి 15 వరకు పిండాలు సేకరించి అద్దె గర్భం ఆవుల్లో ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. సరోగసి ద్వారా అధిక పాలు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.