Avinash Reddy : సునీత స్టేట్ మెంట్ లో చాలా వ్యత్యాసాలు : అవినాష్ రెడ్డి
సునీత భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే తాను అక్కడికి వెళ్ళానని పేర్కొన్నారు. ఫోన్ రావడం పదిహేను నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ రోజు తనపై నిందలు ఉండేవి కావన్నారు.

Avinash Reddy
Avinash Reddy : ఎంపీ స్థాయి వ్యక్తికే నిజాయితీ నిరూపించుకోవడాని చాలా కష్ట పడాల్సివస్తోందని.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. సునీత స్టేట్ మెంట్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. మొదట సునీత ఇచ్చిన స్టేట్ మెంట్ లో తమ ప్రస్తావనే లేదన్నారు. మొదట లెటర్ దాచిన విషయంలో కూడా తమ కుటుంబానికి సంబంధం లేదన్నారు. అయితే, ఇప్పుడు సునీత పూర్తిగా మాట మార్చిందని చెప్పారు.
కడప జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ ముగిసింది. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సునీత భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే తాను అక్కడికి వెళ్ళానని పేర్కొన్నారు. ఫోన్ రావడం పదిహేను నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ రోజు తనపై నిందలు ఉండేవి కావన్నారు. తనను కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Avinash Reddy Bail : అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తనకు, తన నాన్నకు, శంకర్ రెడ్డి అన్నకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వివేకా సార్ ను హత్య చేయబోమే ముందు దస్తగిరి వాళ్లు రాయించిన లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఆనాడే వాళ్లు చంపి డ్రైవర్ ప్రసాద్ ను ఇరికించాలని చూశారని పేర్కొన్నారు. ఈ రోజు అటువంటి కుట్రే తన మీద జరుగుతుందని వాపోయారు. తాను ఏ పాపం చేయలేదు కాబట్టి గత మూడు సంవత్సరాలుగా సీబీఐ విచారణ గురించి పట్టించుకోలేదని చెప్పారు.
మీడియా ఈ కేసులోని వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సూచించారు. బుధవారం, గురువారం కూడా పులివెందులలో ఉంటానని చెప్పారు. సీబీఐ మిమ్మల్ని అరెస్టు చేస్తుందా? అని ఓ మీడియా సంస్థ ప్రశ్నించగా అంతా దైవాదీనం అని అవినాష్ రెడ్డి సమాధానం ఇచ్చారు.