Nara Lokesh : జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తా- నారా లోకేశ్ హాట్ కామెంట్స్

ప్రతిపక్షాలను కేసుల పేరుతో వేధిస్తున్నారు. దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అని లోకేశ్ ధ్వజమెత్తారు. Nara Lokesh

Nara Lokesh : జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తా- నారా లోకేశ్ హాట్ కామెంట్స్

Nara Lokesh - CM Jagan

Updated On : September 26, 2023 / 7:02 PM IST

Nara Lokesh – CM Jagan : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్ర మళ్లీ మొదలు పెడతామని చెప్పినందుకే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నన్ను ఏ-14గా చేర్చారని లోకేశ్ ధ్వజమెత్తారు. 6 నెలల్లో జగన్ కు రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తామని నారా లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. కొన్నిరోజులుగా ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం, ఏపీలో పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు. జగన్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

కేసులో పేరుతో వేధింపులు..
రాష్ట్రపతితో భేటీ తర్వాత నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో 2019 నుండి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలపై జరుగుతున్న అరాచకాల గురించి రాష్ట్రపతికి వివరించినట్లు లోకేశ్ తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో అవినీతి లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారని రాష్ట్రపతికి తెలిపామన్నారు. ప్రతిపక్ష పార్టీలను కేసుల పేరుతో వేధిస్తున్నారని రాష్ట్రపతికి వివరించామన్నారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, ఏపీలో పరిస్థితులు తెలుసుకుంటామని చెప్పారని లోకేశ్ వెల్లడించారు. ఏపీలో ప్రతిపక్షాలను, సామాన్యుల గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని లోకేశ్ ఫైర్ అయ్యారు.

Also Read..KTR: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. మాకేం సంబంధం.. హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు?

ఆ కేసులత నాకు సంబంధమే లేదు..
మా పోరాటం ఆగదని, మా పోరాటాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళతామని లోకేశ్ చెప్పారు. యువగళం పాదయాత్ర ప్రారంభిస్తామని నిన్న ప్రకటించిన వెంటనే గిఫ్ట్ గా నన్ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-14గా పెట్టారని లోకేశ్ ధ్వజమెత్తారు. 6 నెలల్లో ఎన్నికలు వస్తాయని, సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అని లోకేశ్ తేల్చి చెప్పారు.

ఢిల్లీ వచ్చి నన్ను అరెస్ట్ చేసే సత్తా అధికారులకు లేదా? అని సీఐడీ అధికారులను ప్రశ్నించారు లోకేశ్. అంటే కేసులో ఏమీ లేదని తేలిపోయిందన్నారు. కేసులో ఏదైనా ఉంటే ఎక్కడికైనా వెళ్లి అరెస్ట్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది కదా అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసులతో నాకు సంబంధమే లేదని లోకేశ్ తేల్చి చెప్పారు.

జగన్ కు భయం పట్టుకుంది..
న్యాయ పోరాటం కోసమే ఢిల్లీకి వచ్చానని లోకేశ్ తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలను కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తున్నా అన్నారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదన్న లోకేశ్.. అందులో ఉన్న కేసు ఏంటో తనకు అర్థం కాలేదన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ, యువగళం, వారాహి యాత్రలకు ప్రభుత్వం భయపడుతోందని, మాపై దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని లోకేశ్ ధ్వజమెత్తారు.

Also Read..TDP: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

న్యాయం ఆలస్యం కావొచ్చు, కానీ గెలుపు ఖాయం..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని లోకేశ్ అన్నారు. కక్ష సాధింపు తప్ప ఏ ఒక్క కేసులోనూ చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్క కేసులోనూ నాకు, నా కుటుంబానికి, నా సన్నిహితులకు ఒక్క పైసా కూడా రాలేదన్నారు. మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా రకరకాల కుట్రలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. సీఐడీ ఆరోపిస్తున్న కంపెనీలతో మాకు ఎటువంటి సంబంధం లేదని, వాళ్ల దగ్గర కనీసం కప్పు టీ కూడా తాగలేదని లోకేశ్ పేర్కొన్నారు. న్యాయం ఆలస్యం అవుతుందే తప్పా.. జరక్కుండా పోదన్నారు లోకేశ్.

Also Read..Hero Suman : చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ కామెంట్స్.. ఇదొక గుణపాఠం..