ఏపీలో అరాచక పాలన చేస్తున్నారు- చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు జగన్.

ఏపీలో అరాచక పాలన చేస్తున్నారు- చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

Ys Jagan : రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను నాశనం చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పోలీసుల సమక్షంలోనే సుబ్బరాయుడిని హత్య చేసి అతడి భార్యపైనా దాడి చేశారని జగన్ ఆరోపిస్తున్నారు. పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ నిలదీశారు. నంద్యాల జిల్లాలో జగన్ పర్యటించారు. మహానంది మండలం సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు జగన్.

Also Read : సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్‌గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?