ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ..!

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నేత మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే బాగుంటుందని అభిప్రాపడ్డారు.

ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ..!

Updated On : August 21, 2024 / 8:37 PM IST

Botcha Satyanarayana : ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు పంపారు. శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్సను గుర్తించాలని ఛైర్మన్ కు లేఖ రాయనున్నారు వైఎస్ జగన్.

మండలి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తనకు అవకాశం ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాను పార్టీ కేంద్ర కార్యాలయం ఇంఛార్జ్ గా, పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా ఉన్నానని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీలో తనకు మరిన్ని బాధ్యతలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నేత మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే బాగుంటుందని అభిప్రాపడ్డారు.

తనకు వచ్చిన అభిప్రాయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ కు చెప్పానని, ఆయన ఆమోదించారని వెల్లడించారు లేళ్ల అప్పిరెడ్డి. మండలి ప్రతిపక్ష నేత హోదాకి రాజీనామా చేశానని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే మంచి జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇలాంటి సమయంలో సీనియర్ అయిన బొత్స ప్రతిపక్ష నేతగా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేతగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అవకాశం దక్కబోతోంది. మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు పంపారు. వైసీపీ సీనియర్ నేత బొత్సకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తానే వైఎస్ జగన్ కు సిఫార్సు చేశానని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. పార్టీకి, ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టే తాను ఆ ప్రతిపాదన చేసినట్లు ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు, ప్రజలను మోసం చేశారు.. ఈ పరిస్థితుల్లో మండలితో పాటు బయట కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని, సీనియర్ అయిన బొత్స ప్రతిపక్ష నేతగా ఉంటే అటు పార్టీకి, ఇటు ప్రజలకు మంచి జరుగుతుందని లేళ్ల అప్పిరెడ్డి అభిప్రాయపడ్డారు.

అటు మండలి ప్రతిపక్ష నేతగా బొత్సను గుర్తించాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంది. దీనిపై మండలి ఛైర్మన్ కు వైఎస్ జగన్ లేఖ రాయబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు కనుక.. మండలిలో ఆ స్థానం మళ్లీ వైసీపీకే దక్కుతుందని, ప్రతిపక్ష పార్టీ హోదా వైసీపీకే వస్తున్న నేపథ్యంలో బొత్సను ప్రతిపక్ష నేతగా నియమించాలని మండలి ఛైర్మన్ కు లేఖ ఇవ్వనున్నారు జగన్. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మండలి ఛైర్మన్ కార్యాలయంలో బొత్సతో ప్రమాణస్వీకారం చేయించారు. పార్టీ సీనియర్ నేతగా ఉన్న బొత్స ఇకపై మండలి ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు.

 

Also Read : చంద్రబాబుకి భారీ ఊరట.. ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు