Gold Rate: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Gold
Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్. గోల్డ్ రేటు వరుసగా రెండోరోజు కూడా భారీగా పెరిగింది. దీంతో తులం బంగారం ధర మళ్లీ లక్షకు చేరువైంది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు బిగ్ షాకిస్తున్నాయి.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.490 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 450 పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్స్ గోల్డ్ పై 18డాలర్లు పెరిగి గురువారం 3,330 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,910కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,060కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 89,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ.97,910కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,12,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,01,000 కు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,12,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.