Gold Rate Today : బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold
Gold And Silver Prices Today : 2023 సంవత్సరంలో బంగారం ధర 13శాతం మేర పెరిగింది. 2024 సంవత్సరంలోనూ అదేతీరు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, ఈ ఏడాది ప్రారంభమైన మొదటి రోజు నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. వెయ్యి తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,870 ఉండగా.. ప్రస్తుతం 62,950 తగ్గింది. అయితే, ఈనెలాఖరు నుంచి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం అని పేర్కొంటున్నారు.
బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 100 తగ్గింది. మరోవైపు వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 200 పెరిగింది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో ఇలా ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,700కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ.62,950 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,100.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950 వద్ద కొనసాగుతుంది.
– చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.58,200కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.63,490గా నమోదైంది.
పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బుధవారం వెండి ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.76,600కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.74,000 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.