Gold Rate Today : దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు .. మూడ్రోజుల్లోనే భారీగా పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి షాకింగ్ న్యూస్.. దీపావళి పండుగకు ముందు వరకు తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. పండుగ తరువాత ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది.

Gold
Today Gold and Silver Rate : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి షాకింగ్ న్యూస్.. దీపావళి పండుగకు ముందు వరకు తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. పండుగ తరువాత ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. శుక్రవారం స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. శనివారం భారీగా పెరిగింది. శనివారం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 600 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 650 పెరిగింది. ఫలితంగా మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ. 1100 పెరిగింది. వెండి ధరసైతం భారీగా పెరిగింది. శనివారం కిలో వెండిపై రూ. 1500 పెరిగింది. దీంతో నాలుగు రోజుల్లోనే కిలో వెండిపై సుమారు రూ. 4100 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,550 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 61,690కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 61,840.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 650, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 710 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,000 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.62,180కు చేరింది.
పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 1500 పెరిగింది. దీంతో శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,5000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,500. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.76,500 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.75,500 కు చేరింది.