Gold Rate : అక్షయ తృతీయకు ముందు బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ ..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Rate : అక్షయ తృతీయకు ముందు బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ ..

Gold

Gold Silver Rate Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రోజురోజుకు పెరుగుతోంది. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, మే10న (శుక్రవారం) దేశవ్యాప్తంగా ప్రజలు అక్షయ తృతీయ జరుపుకోనున్నారు. ఆరోజున బంగారం కొనుగోలు చేస్తే మంచిదని నమ్మకం. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలుసైతం అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. కొద్దిరోజులుగా గోల్డ్ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అయితే,  అక్షయ తృతీయకు ముందు బంగారం కొనుగోలు దారులకు ఊరట లభించింది. బుధవారం గోల్డ్ ధర తగ్గింది. రాబోయే రెండు రోజుల్లోకూడా బంగారం ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.

Gold woman

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,270 వద్దకు చేరింది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,400 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,420.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,250 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,270.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,300 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.72,330.

Gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.88,500 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 88,500.
కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.85,000.
బెంగళూరులో మాత్రం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 84,100.

Gold

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.