Gold Price Today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ...

Gold Price Today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Price Today

Updated On : December 31, 2025 / 11:51 AM IST

Gold Price Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. కొద్దిరోజులుగా దూసుకెళ్తున్న గోల్డ్, సిల్వర్ ధరలు దిగొస్తున్నాయి. బంగారం ధర భారీగా తగ్గగా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.

Gold

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.320 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 300 తగ్గుదల చోటు చేసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 77 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,290 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన వెండి రేటు బుధవారం స్థిరంగా కొనసాగుతుంది.

Gold Rate

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపై పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ దేశంలోని ప్రధాన నగరాలతోపాటు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver price

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,24,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,35,880కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,24,700 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,36,030కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,24,550 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,35,880కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,58,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,58,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.