Post Office Scheme : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో 5 ఏళ్ల పెట్టుబడితో కేవలం వడ్డీనే రూ. 12 లక్షలకు పైగా వస్తుంది..!

Post Office Scheme : సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన పథకం.. పోస్టాఫీసులో పెట్టుబడితో భారీ మొత్తంలో వడ్డీ పొందవచ్చు. ఈ పథకం ద్వారా వృద్ధులు కేవలం వడ్డీ ద్వారా మాత్రమే రూ. 12,30,000 సంపాదించవచ్చు.

Post Office Scheme : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో 5 ఏళ్ల పెట్టుబడితో కేవలం వడ్డీనే రూ. 12 లక్షలకు పైగా వస్తుంది..!

Post Office Scheme

Updated On : March 23, 2025 / 5:27 PM IST

Post Office Scheme : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ తర్వాత చాలామంది వృద్ధులకు ఎలాంటి సంపాదన ఉండదు. వారికి ఏదైనా సంపాదన ఉందంటే.. రిటైర్‌మ్మెంట్ ఫండ్ మాత్రమే. తమ అవసరాలకు అదే డబ్బును వినియోగించుకుంటారు.

ఈ డబ్బును మరింత పెంచుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెడతారు. తద్వారా తమ డబ్బు కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. చాలా మంది సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పరంగా ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు.

Read Also : Bank Account Rules : బిగ్ అలర్ట్.. బ్యాంకు అకౌంట్లపై రూల్స్.. అంత డబ్బు డిపాజిట్ చేయొద్దు.. ఈ లిమిట్ దాటితే ఐటీ నోటీసులు మీ ఇంటికి..!

కానీ, మంచి రాబడిని అందించే పథకాలలో మాత్రం పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం అలాంటి సినీయర్ సిటీజన్ల కోసం పోస్టాఫీసులో అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. ఇందులో వారికి మంచి మొత్తంలో వడ్డీ లభిస్తుంది. ఈ పథకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం ద్వారా సినీయర్ సిటిజన్లు కోరుకుంటే వారు వడ్డీ నుంచి మాత్రమే రూ. 12,30,000 సంపాదించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంత వడ్డీ వస్తుందంటే? :
పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక డిపాజిట్ పథకం. ఇందులో, 5 ఏళ్ల కాలానికి స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో రూ. 30లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పెట్టుబడి పరిమితి రూ. 1000 ఉంటుంది. ప్రస్తుతం (SCSS)పై 8.2 శాతం వడ్డీ లభిస్తోంది.

రూ. 12,30,000 వడ్డీ పొందొచ్చు :
మీరు ఈ పథకంలో గరిష్టంగా రూ. 30లక్షలు డిపాజిట్ చేయవచ్చు. మీరు ఈ మొత్తాన్ని ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. 5 ఏళ్లలో మీకు 8.2 శాతం చొప్పున రూ. 12,30,000 వడ్డీ లభిస్తుంది. ప్రతి త్రైమాసికంలో రూ. 61,500 వడ్డీగా జమ అవుతుంది. ఈ విధంగా, 5 ఏళ్ల తర్వాత మీకు మెచ్యూరిటీ మొత్తంగా మొత్తం రూ. 42,30,000 లభిస్తుంది.

మరోవైపు, మీరు ఈ పథకంలో 5 ఏళ్ల పాటు రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే.. ప్రస్తుత 8.2 శాతంగా వడ్డీ రేటు ఉంటుంది. మీకు 5 ఏళ్లలో వడ్డీగా రూ. 6,15,000 మాత్రమే లభిస్తుంది. మీరు త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తే.. ప్రతి 3 నెలలకు రూ. 30,750 వడ్డీ లభిస్తుంది. రూ. 15లక్షలకు రూ. 6,15,000 వడ్డీ మొత్తం రూ. 21,15,000 మెచ్యూరిటీ మొత్తంగా అందుతుంది.

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు? :
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. మరోవైపు, VRS తీసుకుంటున్న పౌర రంగ ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ నుంచి పదవీ విరమణ చేసిన వారికి కొన్ని షరతులతో ఏజ్ లిమిట్ సడలింపు ఉంటుంది. ఈ పథకం 5 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ చెందుతుంది.

Read Also : Top 5 Portable ACs : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? తక్కువ ధరలో టాప్ 5 పోర్టబుల్ ఏసీలు మీకోసం.. ఇళ్లంతా కూల్ కూల్..!

మీరు 5 ఏళ్ల తర్వాత కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. డిపాజిట్ మొత్తం మెచ్యూరిటీ చెందిన తర్వాత మీరు అకౌంట్ వ్యవధిని 3 ఏళ్లు పొడిగించవచ్చు. మెచ్యూరిటీ తేదీ నుంచి ఒక ఏడాది లోపు పొడిగించవచ్చు. పొడిగించిన అకౌంట్‌పై మెచ్యూరిటీ తేదీన వర్తించే రేటు వద్ద వడ్డీ లభిస్తుంది. సెక్షన్ 80C కింద (SCSS)లో పన్ను మినహాయింపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.