Stock Market : ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఏకంగా రూ.9.5 లక్షల కోట్లు ఆవిరి..!

Stock market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కుప్పకూలాయి. ట్రంప్ కొత్త టారిఫ్, ప్రపంచ స్థాయిలో వాణిజ్య యుద్ధం భయాందోళనల మధ్య దాదాపు 9.5 లక్షల కోట్లను పెట్టుబడిదారులు నష్టపోయారు.

Stock Market : ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఏకంగా రూ.9.5 లక్షల కోట్లు ఆవిరి..!

Stock market

Updated On : April 4, 2025 / 6:23 PM IST

Stock market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కుప్పకూలాయి. ఏప్రిల్ 4న భారీ క్షీణతతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టపోయాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు ఒకవైపు.. వాణిజ్య యుద్ధ భయాలు మరోవైపు చుట్టేయడంతో అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు ఒక్కసారిగా కుదేల్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఒక శాతానికి పైగా క్రాష్ అయ్యాయి. ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటనతో పెట్టుబడిదారులు భయపడుతున్నారు.

Read Also : ChatGPT Plus : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏఐ ChatGPT ప్లస్ ఫ్రీగా పొందొచ్చు.. ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే? ఫుల్ డిటెయిల్స్..!

స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో కూడా గందరగోళం నెలకొంది. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు రెండూ 3 శాతానికి పైగా పడిపోయాయి. దీని కారణంగా, ఈరోజు స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిదారులు నష్టపోయారు. అన్ని రంగాల సూచీలు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి.

ఐటీ, ఫార్మా, ఎనర్జీ, కమోడిటీ, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ స్టాక్స్ అత్యధికంగా క్షీణించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 930.67 పాయింట్లు లేదా 1.22 శాతం తగ్గి 75,364.69 వద్ద ముగిసింది. మరోవైపు, 50 షేర్ల NSE ఇండెక్స్ నిఫ్టీ 340.70 పాయింట్లు లేదా 1.47 శాతం తగ్గి 22,909.40 వద్ద ముగిసింది.

రూ. 9.78 లక్షల కోట్లు నష్టం :
బిఎస్‌ఇలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏప్రిల్ 4న రూ.403.55 లక్షల కోట్లకు తగ్గింది. అంతకుముందు ట్రేడింగ్ రోజు అంటే.. గురువారం, ఏప్రిల్ 3న రూ.413.33 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీల మార్కెట్ క్యాప్ ఈరోజు దాదాపు రూ.9.78 లక్షల కోట్లు తగ్గింది. మరో మాటలో చెప్పాలంటే.. పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.9.78 లక్షల కోట్లు ఆవిరైపోయింది అనమాట.

ఈ 5 సెన్సెక్స్ స్టాక్స్‌లో అతిపెద్ద క్షీణత :
బిఎస్‌ఇ సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 24 స్టాక్‌లు నష్టాలతో ముగిశాయి. ఇందులో టాటా స్టీల్ షేర్లు 8.59 శాతం క్షీణతతో అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో (L&T), అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 3.83 శాతం తగ్గి 6.15 శాతానికి చేరుకున్నాయి.

అత్యధిక వృద్ధిలో ఈ 5 స్టాక్‌లు :
సెన్సెక్స్‌లో మిగిలిన 6 షేర్లు గ్రీన్ మార్క్‌లో అంటే.. ఈరోజు లాభంతో ముగిశాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్ షేర్లు అత్యధికంగా 1.59 శాతం పెరిగాయి. ఆ తరువాత, HDFC బ్యాంక్, నెస్లే ఇండియా, ICICI బ్యాంక్, ఆసియన్ పెయింట్ షేర్లు 0.27 శాతం నుంచి 1.30 శాతం వరకు లాభాలతో ముగిశాయి.

Read Also : Lamborghini Temerario : లగ్జరీ లంబోర్గిని సూపర్ కారు వస్తోంది.. ఈ నెల 30నే లాంచ్.. కేవలం 2.7 సెకన్లలో 100 కి.మీ హైస్పీడ్..!

క్షీణించిన 2,800 షేర్లు :
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో క్షీణతతో ముగిసిన స్టాక్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈరోజు ఎక్స్ఛేంజ్‌లో మొత్తం 4,076 షేర్లు ట్రేడయ్యాయి. ఇందులో 1,139 షేర్లు లాభాలతో ముగిశాయి. కాగా 2,800 షేర్లు క్షీణించాయి. 137 స్టాక్స్ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి. అంతేకాదు.. ఈరోజు ట్రేడింగ్ సమయంలో 66 స్టాక్‌లు కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. 89 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.