స్నేహం పేరుతో సెల్ఫీలు తీసుకుని యువతిని బ్లాక్ మెయిలింగ్ చేసిన యువకుడు

  • Published By: bheemraj ,Published On : July 24, 2020 / 06:44 PM IST
స్నేహం పేరుతో సెల్ఫీలు తీసుకుని యువతిని బ్లాక్ మెయిలింగ్ చేసిన యువకుడు

Updated On : July 24, 2020 / 6:48 PM IST

స్నేహం పేరుతో సెల్ఫీలు తీసుకుని ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డ యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. యువతితో పరిచయం పెంచుకున్న ఆ యువకుడు ఆమెతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ చాలా సార్లు సెల్ఫీలు తీసుకున్నాడు. ఓ సారి ఆ యువతిని తన కారులో చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో తిప్పాడు.

సరదాగా అంటూ యువతి చేతిలో బీర్ బాటిల్స్ పెట్టి ఫొటోలు తీశాడు. కొద్ది రోజుల తర్వాత నిందితుడు యువతికి ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించకపోగా అప్పటినుంచి అతనికి దూరంగా ఉంటుంది. దీంతో సెల్ఫీలు, బీర్ బాటిల్ తో దిగిన ఫోటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఫోటోలు షోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని..వాటిని మార్పింగ్ చేసి తల్లిదండ్రులు, బంధువులకు పంపిస్తానని బెదిరించాడు.

అతని వేధింపులు భరించలేని యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఏసీపీ హరినాథ్ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఇన్ స్పెక్టర్ రాము టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.