సింగర్ సునీత పేరుతో కోటి 70లక్షలు వసూలు చేసిన దొంగ మేనల్లుడు

  • Published By: naveen ,Published On : August 12, 2020 / 03:22 PM IST
సింగర్ సునీత పేరుతో కోటి 70లక్షలు వసూలు చేసిన దొంగ మేనల్లుడు

Updated On : August 12, 2020 / 3:55 PM IST

సింగర్ సునీత మేనల్లుడిని అంటూ చైతన్య అనే వ్యక్తి పాల్పడిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడు చేసిన ఘరానా మోసం అందరిని షాక్ కి గురి చేసింది. సింగర్ సునీత పేరుతో చైతన్య ఓ మహిళ నుంచి ఏకంగా కోటి 70లక్షలు వసూలు చేయడం విస్మయం కలిగించింది. బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది.

హైదరాబాద్ కొత్తపేటకు చెందిన ఓ మహిళ నుంచి చైతన్య ఏకంగా కోటి 70లక్షలు వసూలు చేసినట్టు తేలింది. సునీత మేనల్లుడిని అంటూ పరిచయం చేసుకుని ఆఫర్లు ఇస్తానంటూ నమ్మబలికి బాధితురాలి నుంచి డబ్బు వసూలు చేశాడు చైతన్య. కేరళలో ఓ ట్రస్ట్ సభ్యత్వం కోసం రూ.50వేలు బదిలీ చేయించుకున్న చైతన్య పలు దఫాల్లో మొత్తం కోటి 70లక్షలు వసూలు చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే చైతన్యను అరెస్ట్ చేసిన పోలీసులు అతడితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.