లోయలో పడిన బస్సు…ఆరుగురు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2019 / 02:19 PM IST
లోయలో పడిన బస్సు…ఆరుగురు మృతి

Updated On : March 24, 2019 / 2:19 PM IST

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆదివారం(మార్చి-24,2019)పాల్ ఘర్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ రోడ్డు దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మధ్యాహ్నాం 2:45గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.నాసిక్ నుంచి బస్సు పాల్ ఘర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు.45మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను అధికారులు త్రయంబకేశ్వర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి తరలించారు.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అంతకుముందు గడ్చిరోలి జిల్లాలో ఓ లారీ-బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.