హాస్పిటల్ లో ఆక్సిజన్ లేక 19 కరోనా బాధితులు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : May 31, 2020 / 09:35 AM IST
హాస్పిటల్ లో ఆక్సిజన్ లేక 19 కరోనా బాధితులు మృతి

Updated On : May 31, 2020 / 9:35 AM IST

భారత్ లో కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా మరణాల్లో కూడా మహారాష్ట్రనే మొదటిస్థానంలో నిలిచింది. అయితే కొందరు బాధితులు వైరస్‌తో పోరాడి మృత్యు ఒడికి చేరుతుండగా.. మరికొందరు హాస్పిటల్స్ లో సరైన వైద్య సదుపాయం అందక ప్రాణాలను వదులుతున్నారు. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటుచేసుకుంది.

ముంబైలోని జోగేశ్వరీ హాస్పిటల్ లో ఆక్సిజన్‌ సదుపాయం లేక కేవలం గంటన్నర వ్యవధిలో 7గురు కరోనా బాధితులు చనిపోయారు. దీంతో 2వారాల వ్యవధిలో ఇదే హాస్పిటల్ లో ఆక్సిజక్‌ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది. హాస్పిటల్ డాక్టర్లు,నర్సులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్పిటల్‌లో వసతులకు మించిన కోవిడ్‌ బాధితులు ఉన్నారు. దీనికి తోడు సీనియర్‌ వైద్యుల కొరత, ఆక్సిజన్‌ లేని కారణంగా గడిచిన రెండు వారాల్లో 12 మంది మృతి చెందారు. ఇప్పుడు మరో 7మంది చనిపోయారు. 

శనివారం తెల్లవారుజామున ఏడుగురు కోవిడ్‌ బాధితులు శ్వసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఆక్సిజన్‌ కూడా అందుబాటులో లేదు. దానికి తోడు ఆ సయమంలో వైద్యులు అందుబాటులో లేరు. ఈ క్రమంలోనే ఆక్సిజన్‌ కోసం పరితపిస్తూ ఏడుగురు ప్రాణాలను వదిలారని తెలిపారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు మాట్లాడుతూ… తమ వద్ద సరైన సదుపాయాలు లేవని బాధితులకు తాము ముందే చెప్పామని తెలిపారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఎవరైనా మృతి చెందితే తమను నిదించవద్దని కూడా ముందే వివరించినట్లు తెలిపారు. కాగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 66వేలు దాటింది