Molestation : రైల్వే స్టేషన్‌లో దారుణం.. పోలీసులం అంటూ బెదిరించి మహిళను పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి

Molestation In Railway Station : పోలీసు దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు భర్తపై దాడి చేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులను వారి బంధువులను ఈ ఘటన భయాందోళనకు గురి చేసింది.

Molestation : రైల్వే స్టేషన్‌లో దారుణం.. పోలీసులం అంటూ బెదిరించి మహిళను పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి

Molestation In Railway Station (Photo : Google)

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా రేపిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తున్నా మార్పు రావడం లేదు. మహిళలకు రక్షణ కరువైంది. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పోలీసులం అంటూ బెదిరించి ఇద్దరు వ్యక్తులు మహిళపై లైంగిక దాడి చేశారు. ఆమె భర్తపై దాడి చేసిన దుండగులు.. భార్యపై లైంగిక దాడికి దిగారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం అశోక్ నగర్ జిల్లా ముంగవోళి రైల్వే స్టేషన్ లో ఈ ఘోరం జరిగింది. జైపూర్ కి వెళ్లాల్సిన రైలు మిస్ కాడంతో భార్యభర్తలు రైల్టే స్టేషన్ లోనే ఉండిపోయారు. చీకటి కావడంతో వారు స్టేషన్ ప్లాట్ ఫామ్ పైనే కూర్చున్నారు. మరో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరికి వచ్చారు. వారిద్దరూ పోలీసు దుస్తుల్లో ఉన్నారు. కానీ, వాళ్లు నకిలీ పోలీసులు. ప్లాట్ ఫామ్ పై కూర్చున్న దంపతుల దగ్గరికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు వారి ట్రైన్ టికెట్స్, ఇతర వివరాల గురించి ఆరాతీశారు. అయితే, దంపతులకు ఎందుకో అనుమానం వచ్చింది. మీ ఐడీ కార్డు చూపించండి అని భర్త వారిని అడిగాడు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు.

Also Read : కాకినాడలో డాక్టర్ ఆత్మహత్య.. వైసీపీ నేతల అనుచరుల వేధింపులే కారణమంటున్న ఫ్యామిలీ

ఊహించని విధంగా మహిళ భర్తను కొట్టారు. అతడిపై దాడి చేసి భార్యను పొదల్లోకి లాక్కెళ్లారు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. దీంతో దంపతులు షాక్ కి గురయ్యారు.

కాసేపటి తర్వాత బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు పోలీసు దుస్తుల్లో వచ్చి లైంగిక దాడికి పాల్పడటాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.

పోలీసు దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు భర్తపై దాడి చేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులను వారి బంధువులను ఈ ఘటన భయాందోళనకు గురి చేసింది. ఇలాంటి ఘోరాలు జరక్కుండా పోలీసులు నిఘా పెంచాలని, తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దుండగులు ఏకంగా పోలీసు దుస్తుల్లో వచ్చి మరీ ఇలాంటి చర్యకు పాల్పడటం ఆందోళనకు గురి చేసే అంశం.

Also Read : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య