ఆ భూముల్ని కబ్జా చేసింది రేవంత్రెడ్డి సోదరులే.. ఆర్డీవోకి ఫిర్యాదు

రాజోల్ సొసైటీ సభ్యులు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళను కలిశారు. సొసైటీ భూమిని రేవంత్రెడ్డి సోదరులు కబ్జా చేశారని ఆర్డీవోకి వివరించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను సొసైటీ సభ్యులు ఆర్డీవోకి అందజేశారు. 2016లో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవంత్రెడ్డి సోదరులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఆర్డీవో దృష్టి తీసుకెళ్లారు.
గోపన్ పల్లి భూ దందాపై రాజేంద్రనగర్ ఆర్డీవోకు బాధితుల లేఖ రాశారు. సర్వే నెంబర్ 127 లో హక్కుదారులైన తమకు రావాల్సిన 2 ఎకరాల 30 గంటల భూమిని ఎంపీ రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి కబ్జా చేశారని బాధితులు ఆర్డీవోను కోరారు. రికార్డులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్డీవోకు రాసిన లేఖకు 2015లో రంగారెడ్డి సివిల్ కోర్టులో కేసు వేసిన పత్రాలను బాధితులు జత చేశారు.
గోపన్ పల్లిలోని విలువైన భూముల్లో అక్రమ లావాదేవీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. గోపన్ పల్లి భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్ అయింది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గా పని చేసిన శ్రీనివాస్రెడ్డిని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈ ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఈ భూముల్లో ఆరు ఎకరాలకు పైగా కొనుగోలు చేశారనే అరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సోదరుల భూ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారన్న ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సస్పెండ్ చేశారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్లను ఇష్టానుసారంగా మార్చి కేవలం మ్యుటేషన్ ఆధారంగానే భూముల లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. భూముల మ్యుటేషన్పై సమగ్ర విచారణ జరపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్ ఆదేశించారు. విచారణలో గోపన్ పల్లి భూముల లావాదేవీలపై మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.