Psycho Killer : మహిళలే టార్గెట్.. ఉపాధి పేరుతో కిడ్నాప్ చేసి హత్యలు, తాండూరులో సైకో కిల్లర్ కలకలం

రెండు రోజుల క్రితం ఓ మహిళను కిడ్నాప్ చేసి హత్య చేశాడు సైకో కిష్టప్ప. మహిళను చంపి శవాన్ని మూట గట్టి పడేశాడు. ఈ హత్య కేసును సవాల్ తీసుకున్న తాండూరు పోలీసులు.. మర్డర్ మిస్టరీని చేధించారు.

Psycho Killer : మహిళలే టార్గెట్.. ఉపాధి పేరుతో కిడ్నాప్ చేసి హత్యలు, తాండూరులో సైకో కిల్లర్ కలకలం

Tandur Psycho Killer

వాడు ఓ సైకో. మహిళలే వాడి టార్గెట్. ఉపాధి కోసం వెతుకుతున్న మహిళలను గుర్తిస్తాడు. తన మాయ మాటలతో వారిని బుట్టలో వేసుకుంటాడు. ఉపాధి చూపిస్తానని వారిని నమ్మిస్తాడు. ఆ తర్వాత అతడి అసలు రంగు చూపిస్తాడు. మహిళలను కిడ్నాప్ చేసిన మర్డర్ చేస్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు చేశాడు ఆ సైకో కిల్లర్. తాండూరులో సైకో కిల్లర్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.

Also Read : సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్త.. మైనర్ బాలికపై లైంగిక దాడి, ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్

వికారాబాద్‌ జిల్లా తాండూరులో సైకో కిల్లర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉపాధి పేరుతో మహిళలకు ఎర వేస్తాడు. ఆ తర్వాత వారిని కిడ్నాప్ చేసి హత్యలు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఓ మహిళను కిడ్నాప్ చేసి హత్య చేశాడు సైకో కిష్టప్ప. మహిళను చంపి శవాన్ని మూట గట్టి పడేశాడు. ఈ హత్య కేసును సవాల్ తీసుకున్న తాండూరు పోలీసులు.. మర్డర్ మిస్టరీని చేధించారు. హంతకుడిని కిష్టప్పగా గుర్తించారు. వాడు సైకో కిల్లర్ అని తెలిపారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఇప్పటివరకు ఆరుగురు మహిళలను సైకో కిష్టప్ప హత్య చేశాడని తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు.

Also Read : వామ్మో.. బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌లో 13వేల ప్రైవేట్ ఫోటోలు, షాక్‌లో ప్రియురాలు