ప్రాణం తీసిన మిస్డ్ కాల్ అక్రమ సంబంధం

  • Published By: murthy ,Published On : June 5, 2020 / 07:29 AM IST
ప్రాణం తీసిన మిస్డ్ కాల్ అక్రమ సంబంధం

Updated On : June 5, 2020 / 7:29 AM IST

తన ఫోన్ కు వచ్చిన అపరిచిత ఫోన్ కాల్ తో ఒక మహిళ పరిచయమయ్యింది. ఆమె తనకు తెలియనప్పటికీ, వివాహిత అయిన ఆమెతో స్నేహం కోనసాగించాడో యువకుడు. ఆ స్నేహం కాస్తా వివాహేతర సంబంధంగా మారటంతో చివరికి అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు లోని  మాదావరలో నివాసం ఉండే చంద్రశేఖర్ (20)కు చిన్నాదేవి అగ్రహార కు చెందిన ఒక వివాహిత మహిళ మిస్డ్ కాల్ ద్వారా పరిచయం అయ్యింది. ఈ పరిచయం కాస్తా రోజూ ఫోన్ లో చాటింగ్ చేసుకునే దాకా వెళ్లింది. కొన్నాళ్లకు ఆస్నేహం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా వారిద్దరి మధ్య బంధం ఏర్పడటంతో ఇద్దరూ కల్సి ఎవరికీ తెలియకుండా కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న వివాహిత మహిళ భర్త, వీరిని వెతికి పట్టుకుని తన భార్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంత జరిగి, ఇంటికి వెళ్లినా ఆమె మళ్లీ తన ప్రియుడితో స్నేహం కొనసాగిస్తూనే ఉండేది. కొన్నాళ్లకు మళ్లీ ప్రియుడితో వెళ్లిపోయింది.

భార్య   రెండో సారి ప్రియుడితో వెళ్లిపోవటం తట్టుకోలేని భర్త,  చంద్రశేఖర్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన బంధువులతో కలిసి, చంద్రశేఖర్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికెళ్లి అతడిపై దాడి చేశారు. దాడిలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన చంద్రశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Read: కాపురం కూల్చిన సోషల్ మీడియా : ఫేస్ బుక్ ఫ్రెండ్ తో లేచిపోయిన భార్య