ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఇంకా అప్లై చేసుకోలేదా? మీకో గుడ్‌న్యూస్‌

దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచిన నేపథ్యంలో దీనిపై ప్రచారం కల్పించాలని పేర్కొంది.

ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఇంకా అప్లై చేసుకోలేదా? మీకో గుడ్‌న్యూస్‌

Updated On : May 30, 2025 / 9:37 AM IST

ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మీకో గుడ్‌న్యూస్‌. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ పోస్టుమెట్రిక్ విద్యార్థులకు సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు గడువును తెలంగాణ సర్కారు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 31తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉంది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Also Read: పడిపోనున్న బంగారు ఆభరణాల అమ్మకాలు

మొత్తం కలిపి 11,88,120 మంది స్టూడెంట్లు దరఖాస్తులు చేసుకుంటారని అధికారులు భావించగా.. ఇప్పటివరకు 10,75,041 మంది అప్లై చేసుకున్నారు. మరో 1,13,079 మంది స్టూడెంట్స్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

దరఖాస్తుల గడువును పెంచాలని విజ్ఞప్తులు రావడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాలేజీలు, సంక్షేమ శాఖల అధికారులకు సూచనలు చేస్తూ… గడువులోగా ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకునేలా చూడాలని చెప్పింది. దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచిన నేపథ్యంలో దీనిపై ప్రచారం కల్పించాలని పేర్కొంది.