ఏపీలో ప్రారంభమైన గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ 

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 05:17 AM IST
ఏపీలో ప్రారంభమైన గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ 

Updated On : May 5, 2019 / 5:17 AM IST

ఏపీలో గ్రూప్-2 స్ర్కీనింగ్ టెస్ట్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 727 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగనుంది. ఉదయం 9.30 గంటలకు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. స్ర్కీనింగ్ టెస్ట్ కు 2 లక్షల 95 వేల 36 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష జరుగుతోంది. 

ఈసారి గ్రూప్-2 పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. ఒక్కో తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 12 నిష్పత్తిలో మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. వీరికి జులై 18, 19 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్లూ రాయాల్సిందే. ఏ ఒక్క పేపర్‌ రాయకపోయినా తర్వాత ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.