ఇండియా ఫస్ట్: ఐఐటీ హైదరాబాద్.. ఏఐలో బీటెక్ కోర్సు 

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ పూర్తిస్థాయిలో బిటెక్ ప్రొగ్రామ్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే అకాడమిక్ (2019-2020) నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో బీటెక్ ప్రొగ్రామ్స్ ను పూర్తిస్థాయిలో తీసుకరానున్నట్టు వెల్లడించింది.

  • Published By: sreehari ,Published On : January 17, 2019 / 12:47 PM IST
ఇండియా ఫస్ట్: ఐఐటీ హైదరాబాద్.. ఏఐలో బీటెక్ కోర్సు 

Updated On : January 17, 2019 / 12:47 PM IST

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ పూర్తిస్థాయిలో బిటెక్ ప్రొగ్రామ్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే అకాడమిక్ (2019-2020) నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో బీటెక్ ప్రొగ్రామ్స్ ను పూర్తిస్థాయిలో తీసుకరానున్నట్టు వెల్లడించింది.

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ పూర్తిస్థాయిలో బిటెక్ ప్రొగ్రామ్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే అకాడమిక్ (2019-2020) నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మిషన్ లెర్నింగ్ విభాగంలో బీటెక్ ప్రొగ్రామ్స్ ను పూర్తిస్థాయిలో తీసుకరానుంది. ఏఐలో పూర్తిస్థాయి బీటెక్ ప్రొగ్రామ్ ను ప్రవేశపెట్టనున్న తొలి భారతీయ విద్యాసంస్థగా ఐఐటీ హైదరాబాద్ రికార్డులెక్కనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా యూఎస్ తరువాత మూడో విద్యాసంస్థగా ఐఐటీ హైదరాబాద్ అవతరించనుంది. 

తొలుత బీటెక్ కోర్సులో 20 మంది విద్యార్థులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బీటెక్ కోర్సుకు అర్హత సాధించాలంటే ముందుగా జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష ద్వారా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ ఏఐ మిషన్ లెర్నింగ్ విభాగంలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. ఇప్పటికే యూఎస్ లో మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), కార్నెజీ మెలాన్ యూనివర్శిటీ (సీఎంయూ) వంటి టెక్నాలజీ, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో పూర్తిస్థాయి బీటెక్ ప్రొగ్రామ్ అందుబాటులో ఉన్నట్టు ఓ అధికారిక ప్రకటనలో వెల్లడైంది.