పంచాయతీ సమరం : పోలింగ్ స్టార్ట్

హైదరాబాద్ : తెలంగాణలో తుది విడత పంచాయతీ సంగ్రామం ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది. మూడున్నరవేల గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2గంటల తరువాత ఓట్ల లెక్కింపు చేపడతారు..
- తుది విడతలో 4,116 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్
- రాష్ట్ర వ్యాప్తంగా 577 పంచాయతీలు ఏకగ్రీవం
- పది గ్రామాల్లో దాఖలు కాని నామినేషన్లు
- 3,529 గ్రామాల్లో పోలింగ్
- సర్పంచ్ పదవులకు 11,667 మంది పోటీ
- మొత్తం 36,729 వార్డులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్
- రాష్ట్ర వ్యాప్తంగా 8,959 వార్డులు ఏకగ్రీవం
- 186 వార్డుల్లో దాఖలు కాని నామినేషన్లు
- 27,582 వార్డులకు పోలింగ్
- వార్డు సభ్యుల పదవులకు మొత్తం 73,976 మంది పోటీ
- పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతిలేదు