అదే జరిగితే క్యాన్సర్ వస్తుంది.. పిల్లలు పిచ్చివాళ్లు అవుతారు: పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన యురేనియం తవ్వకాల ప్రతిపాదనపై పోరాటం చేసే దిశగా కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రజా ప్రయోజనార్థం యూరేనియం తవ్వకాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇదే విషయమై కమిటీ వేసింది తెలంగాణ కాంగ్రెస్. యురేనియం తవ్వకాలు ఒక్క గిరిజనుల సమస్యే కాదని, రాష్ట్రానికి సంబంధించిన సమస్య అని, దీనిపై పోరాటానికి సీనియర్ లీడర్ వీహెచ్ అధ్యక్షతన కమిటీ వేశారు. ఈ క్రమంలో కమిటీ అధ్యక్షలు వీ హనుమంతరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు.
వీహెచ్ తో భేటి అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఈ దేశ సంస్క్రతికి మూలవాసులుగా వున్న చెంచుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారిని రెడ్ ఇండియన్ లాగా తూడ్చివేయాలని చూస్తున్నారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎంతోమంది యూరేనియం తవ్వకాల నిర్ణయం వల్ల ఇబ్బందులు పడుతారని ఈ విషయాన్ని వీహెచ్ జనసేన పార్టీ దృష్టికి తీసుకుని వచ్చారని, ఈ నిర్ణయం వల్ల చెంచులు ఇబ్బందులు పడుతారని భావించి దీనిపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.
యూరేనియం తవ్వకాలు సాగితే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కిడ్నీలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని, కొందరు పిచ్చివాళ్లు అవుతారని, వికలాంగులు అవుతారని, ఎక్స్ పర్ట్స్ ను పిలిచి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఇదే సంధర్భంగా మాట్లాడిన వీహెచ్.. యురేనియం తవ్వకాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని పీసీసీ అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారని, పవన్ కళ్యాణ్ ఇటువంటి ఇష్యూలలో ముందుకు వెళ్తడు.. అని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే యురేనియం తవ్వకాలపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి యురేనియం తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం ముఖ్యం అని అందుకే జీవితాలను నాశనం చేసే యూరేనియం తవ్వకాలను ఆపాలని కోరారు.