సెంటిమెంట్ ట్రబుల్స్ : కాయిన్ వేశాడు..విమానం ఆగింది

అన్హుయి: సెంటిమెంట్ తో ఓ వ్యక్తి చేసిన పని విమాన సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టింది. కుదురుగా విమానం ఎక్కాల్సిన ప్రయాణికుడు చేసిన తెలివి తక్కువ పనికి సిబ్బంది మొత్తం ఉరుకులు పరుగులు పెట్టారు. ఇంతకూ అతను చేసిన పనేంటాని అనుకుంటున్నారా..విమానం ఇంజన్ లోకి ఓ కాయిన్స్ విసిరాడు..ఇంకేముంది నేరుగా ఇంజిన్లోకి వెళ్లి టర్బైన్ను ధ్వంసమయ్యాయి. దీంతో ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. ఇంకే చేస్తారు విమానాన్ని ఆపేసారు. ఎవరా వెంగళప్ప..ఏమా కథ తెలుసుకుందాం.
చైనాకు చెందిన లూ అనే 28 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఏడాది కుమారుడితో కలిసి అన్హుయిలోని విమానాశ్రయంలో లక్కీ ఎయిర్ ఫ్లైట్ 8L9960 విమానంలో యున్నన్కు బయల్దేరేందుకు వచ్చాడు. అతనికి విమానం ఎక్కటం అదే ఫస్ట్ టైమ్. ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు..ప్రమాదాలు జరగకుండా సాగాలని లేకుండా.. ‘గుడ్ లక్ కాయిన్స్’ను విమానం ఎడమ వైపు ఇంజిన్లోకి విసిరాడు.
లూ విసిరిన నాణెలు నేరుగా ఇంజిన్లోకి వెళ్లి టర్బైన్ను ధ్వంసం చేశాయి. ఇంజిన్ ఫెయిల్ కావడంతో విమానాన్ని నిలిపివేశారు. లూ నిర్వాకానికి విమానంలోని 162 మంది ప్రయాణికులు రోజంతా పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇది తెలుసుకున్నా విమానాశ్రయం అధికారులు లూను అదుపులోకి తీసుకున్నారు. ఇంజిన్లోకి నాణెలు విసరడం వల్ల 14.87 లక్షల నష్టం వాటిల్లిందని ‘లక్కీ ఎయిర్’ ఆ మొత్తాన్ని లూ నుంచే వసూలు చేస్తామని తెలిపింది. 2017లో కూడా లక్కీ ఎయిర్ సంస్థ ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. 76 ఏళ్ల వృద్ధురాలు విమానం ఇంజిన్లోకి గుడ్ లక్ నాణెలు విసిరింది. అదే ఏడాది చైనాకు చెందిన సదరన్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్లో కూడా ఓ యువతి నాణెలు విసిరి సిబ్బందిని పరుగులు పెట్టించింది. ప్రయాణాల సమయంలో చైనీయులు గుడ్ లక్ నాణెలను విసురుతుంటారు. దీనివల్ల తమ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగదనేది వారి విశ్వాసం. అదే ఇప్పుడు వారిని ఇబ్బందుల్లోకి నెడుతోంది.