కరోనా వైరస్ గురించి 12 ఏళ్ల కిందటే రాశారు

  • Published By: chvmurthy ,Published On : March 4, 2020 / 10:53 PM IST
కరోనా వైరస్  గురించి 12 ఏళ్ల కిందటే రాశారు

Updated On : March 4, 2020 / 10:53 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణ లో బయట పడింది. ఎక్కడ చూసినా కరోనా వైరస్‌ గురించే చర్చ జరుగుతోంది. ప్రజలు హడలి పోతున్నారు. కానీ దీని గురించి 12 ఏళ్ళ  కిందటే ప్రస్తావించారు అమెరికాకు చెందిన రచయిత్రి సిల్వియా బ్రౌన్‌. (రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ; విద్యాశాఖ కీలక నిర్ణయం)

‘2020లో న్యిమోనియా లాంటి తీవ్రమైన ఒక వ్యాధి విజృంభిస్తుందని… జర్వంలాంటి లక్షణాలను కలిగి ఉండే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని… దీని ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతినడం… శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆమె రాసిన ‘ఎండ్‌ ఆఫ్‌ డేస్‌: ప్రిడిక్షన్స్‌ అండ్‌ ప్రొపెసిస్‌ ఎబౌట్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ (ప్రపంచం అంతం గురించి జోస్యం)’ పేర్కోన్నారు.

అంతేకాదు మనకు తెలిసిన వైద్యానికి ఈ వ్యాధి తొందరగా తగ్గకపోవచ్చు’ అని కుడా ఆమె రాసిన  పుస్తకంలో ఉన్నది. ఇందుకు సంబంధించిన పుస్తకంలోని ఓ పేజీ సోషల్‌ మీడియాలో  ప్రస్తుతం  వైరల్‌ అవుతోంది.