Singapore : కడుపునిండా పీతల కూర తిన్నారు..బిల్లు చూసి షాకయ్యారు.. రెస్టారెంట్ ఎంత బిల్లు వేసిందంటే?
కొత్త ప్రాంతాలకు వెళ్లినపుడు ప్రతీది రేట్లు తెలుసుకుని వెళ్లాలి. లేదంటే ప్రతి ఒక్కరి దగ్గర మోసపోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్తో సింగపూర్ వెళ్లిన ఓ జపాన్ టూరిస్టుకి ఓ రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. అదేంటో చదవండి.
Singapore : క్రాబ్ డిష్కి అక్షరాల రూ.56,000 బిల్లు వేసింది ఓ రెస్టారెంట్. షాకైన జపాన్ టూరిస్ట్ పోలీసులకు ఫోన్ చేసింది. ఎక్కడంటే?
Rail Coach Restaurant : రైల్ కోచ్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది.. ఎక్కడో తెలుసా?
రీసెంట్గా జంకో షిన్బా అనే జపాన్ టూరిస్టు స్నేహితులతో కలిసి సింగపూర్లోని సీఫుడ్ ప్యారడైజ్ రెస్టారెంట్కి వెళ్లింది. క్రాబ్ డిష్కి $680 (ఇండియన్ కరెన్సీలో రూ. 56,503) బిల్లు వేయడంతో వారంతా షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెయిటర్ సలహాతో అలస్కాన్ కింగ్ చిల్లీ క్రాబ్ డిష్ ఆర్డర్ చేసినట్లు షిన్బా చెప్పింది. వెయిటర్ క్రాబ్ను $20 ( ఇండియన్ కరెన్సీలో 1,662.08) అని మాత్రమే చెప్పాడని.. దాని బరువెంత ఉందో చెప్పలేదని షిన్బా వాపోయింది. ఇక నలుగురు కలిసి 3,500 గ్రాముల డిష్ను తిన్నారట. వారికి $680 బిల్లు వేసారు.
షిన్బా ఫిర్యాదుతో పోలీసులు రెస్టారెంట్కి చేరుకున్నారు. అయితే ఆమె బృందానికి ఎక్కువ ఛార్జీ విధించలేదని రెస్టారెంట్ సిబ్బంది పేర్కొంది. అయితే కొంతసేపు డిస్కషన్ తర్వాత రెస్టారెంట్ $78 (ఇండియన్ కరెన్సీలో రూ. 6,479) తగ్గించారు. ఈ ఘటనపై షిన్బా సింగపూర్ టూరిజం బోర్డును సంప్రదించింది. కేసును సింగపూర్ వినియోగదారుల అసోసియేషన్కు సూచించింది.