1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఏపీ ప్రభుత్వం జీవో

సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 07:16 AM IST
1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఏపీ ప్రభుత్వం జీవో

Updated On : October 31, 2020 / 2:35 PM IST

సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో

సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం బుధవారం(మే 13,2020) ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి. వాటిల్లో విద్యార్థులు కోరుకుంటే సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం క్లాసులను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం అమలవుతున్న ప్రభుత్వ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఇక 7, 8, 9, 10 తరగతులు కూడా ఏటా క్రమేణా ఇంగ్లీష్ మీడియంగా మారతాయి.
 
* వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ మీడియంలో ధన కోరుకుంటున్నారో ఆప్షన్‌ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ గవర్నమెంట్ స్కూల్స్ లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు మూడు ఆప్షన్లు ఇచ్చింది. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన, ఇతర మాతృ భాషల్లో బోధనలో ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. 

* మొత్తం 17లక్షల 97వేల 168 మంది నుంచి ఆప్షన్లు రాగా 53వేల 943 మంది తెలుగు మీడియంలో బోధన కోరుకున్నారు. అయితే ఈ విద్యార్థుల కోసం ఆయా పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తరగతుల ఏర్పాటు పాలనాపరంగా, ఆర్థికపరంగా సాధ్యం కాదు కనుక గతంలో ఇచ్చిన జీఓ 15 ప్రకారం ప్రతి మండల కేంద్రంలో (672 మండలాల్లో) ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. దూరంగా ఉన్నవారికి రవాణా ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది.

ప్రభుత్వానికి నివేదిక:
తమకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన కావాలని 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఆప్షన్లు ఇచ్చిన నేపథ్యంలో మాధ్యమంపై రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలిని ప్రభుత్వం నివేదిక కోరిన సంగతి తెలిసిందే. విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సోమవారం ప్రభుత్వానికి 59 పేజీల నివేదికను సమర్పించింది. నివేదికలో పలు అంశాలను సమగ్రంగా విశ్లేషించి ఇంగ్లీష్ మీడియం ఠశాల స్థాయి నుంచి ఎంత అవసరమో ఎస్సీఈఆర్టీ ప్రస్తావించింది. విద్యార్థులు మాతృభాషలో ప్రావీణ్యతను సంతరించుకునేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూనే ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని సిఫార్సు చేసింది. దీని ద్వారానే లక్ష్యాలు నెరవేరతాయని స్పష్టం చేసింది. ఎస్సీఈర్టీ  సిఫార్సులను ప్రభుత్వం యధాతథంగా ఆమోదించింది.

ముఖ్యమైన సిఫార్సులు..
* విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. అభ్యసనం వివిధ ప్రక్రియల ద్వారా కొనసాగాలి
* విద్యార్థులు ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా తడబాటుకు తావు లేకుండా చెప్పగలగాలి
* ప్రభుత్వం 1 నుంచి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశలవారీగా ప్రవేశపెట్టేందుకు సిఫార్సు
* విద్యార్థులు, తలిదండ్రులు ఇంగ్లీషు మాధ్యమాన్ని కోరుకుంటున్నందున ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని 1 నుంచి 6 వ తరగతి వరకు ప్రవేశపెట్టవచ్చు.
* ఎస్సీఈఆర్టీ 1-6 ఆంగ్ల మాధ్యమం పుస్తకాలకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేసి పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేసింది.  
* ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు.
* తెలుగు సబ్జెక్టును 1 నుంచి 10 తరగతి వరకు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు పాఠ్య పుస్తకాలను పటిష్టంగా తీర్చిదిద్దింది.

Read Here>> NCERT Report : ఈస్ట్ ఆర్ వెస్ట్..English is the బెస్ట్