COVID-19 cases in India: దేశంలో కొత్తగా 1,132 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 1,132 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల నిన్న 14 మంది మృతి చెందారని, వారిలో ఐదుగురు కేరళకు చెందిన వారేనని తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 5,30,500కు చేరిందని వివరించింది. ప్రస్తుతం దేశంలో 14,839 మంది హోం క్వారంటైన్లు/ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.

COVID-19 cases in India: దేశంలో కొత్తగా 1,132 కరోనా కేసులు నమోదు

india corona cases

Updated On : November 6, 2022 / 12:05 PM IST

COVID-19 cases in India: దేశంలో కొత్తగా 1,132 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల నిన్న 14 మంది మృతి చెందారని, వారిలో ఐదుగురు కేరళకు చెందిన వారేనని తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 5,30,500కు చేరిందని వివరించింది. ప్రస్తుతం దేశంలో 14,839 మంది హోం క్వారంటైన్లు/ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.

కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా ఉందని చెప్పింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,41,15,240కు చేరిందని వివరించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 4,46,60,579గా ఉన్నాయని తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 219.72 కోట్లకు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. నిన్న దేశంలో 1,38,948 వ్యాక్సిన్ డోసులను వేసినట్లు తెలిపింది. నిన్న దేశంలో 1,55,015 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..