తెలంగాణలో కరోనా : 24 గంటల్లో 721 కేసులు, కోలుకున్నది 753

COVID 19 in Telangana : తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయా? గత 24 గంటల్లో 721 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేల 261కు చేరాయి. 753 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 66 వేల 120 ఉన్నాయి. ముగ్గురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 480 మందికి చేరుకుంది. 2020, డిసెంబర్ 09వ తేదీ బుధవారం ప్రజారోగ్య మరియు కుటుంబసంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేల 661 ఉండగా..గృహ/సంస్థల ఐసోలేషన్ లో గల వ్యక్తుల సంఖ్య 5 వేల 576 ఉన్నాయి.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ – 5. భద్రాద్రి కొత్తగూడెం – 26. జీహెచ్ఎంసీ – 123. జగిత్యాల – 17. జనగామ – 09. జయశంకర్ భూపాలపల్లి : 10. జోగులాంబ గద్వాల : 0. కామారెడ్డి : 11. కరీంనగర్ – 37. ఖమ్మం – 32. కొమరం భీం ఆసీఫాబాద్ – 08. మహబూబ్ నగర్ – 17. మహబూబాబాద్ – 16. మంచిర్యాల – 27. మెదక్ – 12. మేడ్చల్ మల్కాజ్ గిరి – 58. ములుగు – 14. నాగర్ కర్నూలు : 10. నల్గొండ – 31. నారాయణపేట – 0. నిర్మల్ – 3. నిజామాబాద్ – 18. పెద్దపల్లి – 24. రాజన్న సిరిసిల్ల – 09. రంగారెడ్డి – 51. సంగారెడ్డి – 32. సిద్ధిపేట – 18. సూర్యాపేట – 21. వికారాబాద్ – 09. వనపర్తి – 02. వరంగల్ రూరల్ – 10. వరంగల్ అర్బన్ – 47. యాదాద్రి భువనగిరి – 14. మొత్తం :- 721