జెనీలియా దంపతుల నిర్ణయం.. హ్యాట్సాఫ్ అంటున్న జనం..
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రితేష్ దేశ్ముఖ్, జెనీలియా దేశ్ముఖ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు వారు ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో జెనీలియా ఓ వీడియోను పోస్ట్ చేసింది.
‘రితేష్, నేను దీని గురించి ఎప్పట్నుంచో ఆలోచిస్తున్నాం. కానీ, ఇప్పటివరకు కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు వేరొకరికి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వడమే. కాబట్టి మీరు కూడా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రండి. అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయండి’ అని జెనీలియా కోరింది. కాగా జెనీలియా దంపతులు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ, పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు వారిని ప్రశంసిస్తున్నారు.
https://www.instagram.com/p/CCGQfaKpq6e/?utm_source=ig_web_copy_link
Read:సీఎం జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పిన పూరీ జగన్నాథ్..ఎందుకో తెలుసా