Poonam Pandey : బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండే కన్నుమూత

నటి, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ పరుల్ చావ్లా వెల్లడించారు.

Poonam Pandey : బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండే కన్నుమూత

Poonam Pandey

Poonam Pandey : బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ పరుల్ చావ్లా వెల్లడించారు. పూనమ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె మరణ వార్త విన్న తర్వాత అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

పూనమ్ పాండే ప్రముఖ మోడల్, నటి క్యాన్సర్ కారణంగా మరణించారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ పరుల్ చావ్లా ఇండియా టుడేకి వెల్లడించారు. శుక్రవారం ఉదయం పూనమ్ పాండే  ఆమె ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చూసి అందరూ షాకయ్యారు. ‘ఈ ఉదయం మాకు చాలా కష్టమైనది.. మా ప్రియమైన పూనమ్‌ను సర్వైకల్ క్యాన్సర్ వల్ల కోల్పోయామని మీకు తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాను.. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని ఆమె ఎంతగానో ప్రేమించింది. ఈ దుఃఖ సమయంలో ఆమె ప్రేమను గుర్తు చేసుకుంటూ సంయమనం పాటించాల్సిందిగా అభ్యర్ధిస్తున్నాము’ అంటూ పోస్ట్‌ కనిపించింది. చాలామంది ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌‌గానే భావించారు. పూనమ్ మేనేజర్ ప్రకటనతో ఆమె మరణం నిర్ధారణ అయ్యింది.

Also Read : 92 ఏళ్ళ సినీ చరిత్రలో ‘హనుమాన్’ సరికొత్త సంచలనం..

అత్యంత వివాదాస్పద నటిగా పేరున్న పూనమ్ పాండే 32 సంవత్సరాల అతి చిన్న వయసులో కన్నుమూయడం అటు బాలీవుడ్ ఇటు మోడలింగ్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది.  పూనమ్ పాండే 2013 లో ‘నషా’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో మాలిని అండ్ కో అనే సినిమాలో టైటిల్ రోల్ పోషించారు. కన్నడ, భోజ్ పురి భాషల్లో కూడా నటించారు. వివాదాస్పద నటిగా పూనమ్ ముద్ర వేసుకున్నారు. 2011 లో క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో టీమ్ ఇండియా ఫైనల్‌లో గెలిస్తే తాను గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచారు. తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేని పెళ్లాడి తనపై దాడి చేసాడన్న ఆరోపణలతో విడిపోయారు. 2022 లో కంగన రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ షో ‘లాక్ అప్’ లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు పూనమ్ పాండే.

Also Read: 70 ఏళ్ళ బామ్మల విషయంలో.. రవితేజ చేసిన పని అందర్నీ ఆకట్టుకుంటుంది..

కాగా పూనమ్ పాండే కొంతకాలం క్రితం సర్వైకల్ క్యాన్సర్ బారిన పడ్డారని  చివరి దశలో చికిత్స అందినా సర్వైవ్ కాలేకపోయారని తెలుస్తోంది. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఆమె స్వగ్రామంలో ఉన్నారని.. అక్కడే ఆమె అంత్యక్రియలు జరుగుతాయని పాండే మేనేజర్ పరుల్ చావ్లా పేర్కొన్నారు.