Bigg Boss 7 Day 38 : వచ్చిన కెప్టెన్సీని వాడుకోలేకపోయాడు.. శివాజీ కూడా ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు..
కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఎన్నికైన సంగతి తెలిసింది. అయితే ప్రశాంత్ కెప్టెన్సీ వచ్చినా ఏమి చేయలేదు హౌస్ లో. దీంతో బిగ్బాస్ ప్రశాంత్ పై ఫైర్ అయి..................
Bigg Boss 7 Day 38 : బిగ్బాస్ ఆరోవారం కొత్తగా కంటెస్టెంట్స్ వచ్చినా చెప్పగానే సాగుతుంది. ఉన్న కంటెస్టెంట్స్ ని ఆటగాళ్లు – పోటుగాళ్లుగా డివైడ్ చేసి కెప్టెన్సీ టాస్కుల కోసం వారి మధ్య పోటీలు పెడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం సగం గేమ్స్ పెట్టగా మిగిలినవి బుధవారం పెట్టారు. బుధవరాం నాడు హూ ఈజ్ స్ట్రాంగెస్ట్, హూ ఈజ్ ఫాస్టెస్ట్ అని రెండు టీమ్స్ మధ్య గేమ్స్ పెట్టాడు బిగ్బాస్. మొత్తం పెట్టిన గేమ్స్ లో మూడు పోటుగాళ్ళు గెలవగా ఒకటి ఆటగాళ్లు గెలిచారు. దీంతో ఇవాళ్టి నుంచి కెప్టెన్సీ టాస్కులు జరుగుతాయి. ఇందులో పోటుగాళ్ళు అంతా కెప్టెన్సీ కోసం తలపడనున్నారు. మరి ఈ వారం కెప్టెన్సీ ఎవరికి వస్తుందో చూడాలి.
ఇక గతవారం కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఎన్నికైన సంగతి తెలిసింది. అయితే ప్రశాంత్ కెప్టెన్సీ వచ్చినా ఏమి చేయలేదు హౌస్ లో. దీంతో బిగ్బాస్ ప్రశాంత్ పై ఫైర్ అయి కెప్టెన్సీ వచ్చినా కంటెస్టెంట్స్ తప్పు చేస్తున్నా పట్టించుకోలేదు. అసలు హౌస్ లో ఏం జరుగుతుందో చూడలేదు అంటూ అర్దాంతరంగా ప్రశాంత్ కెప్టెన్సీని పీకి పడేసాడు బిగ్బాస్.
Also Read : Bigg Boss 7 : పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ ఊడింది..! ఏడ్చేసిన రైతు బిడ్డ..!
ఇక మరో వైపు అమర్ దీప్ గేమ్స్ లో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదని నైట్ పడుకునేముందు ఎమోషనల్ అయ్యాడు. సందీప్, ప్రియాంక అమర్ దీప్ ని కాసేపు ఓదార్చారు. కెప్టెన్సీ పోవడంతో ప్రశాంత్ కూడా ఏడుస్తుండటంతో ఇన్నాళ్లు సపోర్ట్ చేసిన శివాజీ కూడా ప్రశాంత్ కి ఏం చేతకాదు ఏడవడం తప్ప అని నెగిటివ్ కామెంట్స్ చేశాడు. శివాజీ కూడా ప్రశాంత్ మీద నెగిటివ్ కామెంట్స్ చేయడంతో ప్రశాంత్ తో పాటు ఇంట్లోని సభ్యులంతా ఆశ్చర్యపోయారు.