Adavallu Meeku Joharlu: శర్వా సినిమాకి సుక్కూ ఆశీస్సులు.. వాయిస్ ఓవర్!

చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీ స్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వ..

Adavallu Meeku Joharlu: శర్వా సినిమాకి సుక్కూ ఆశీస్సులు.. వాయిస్ ఓవర్!

Adavallu Meeku Joharlu

Updated On : March 2, 2022 / 3:22 PM IST

Adavallu Meeku Joharlu: చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీ స్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ సినిమాని ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేయగా భీమ్లా నాయక్ అదే డేట్ కి రావడంతో అప్పుడు వాయిదా వేసుకున్నారు. కాగా.. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల కానుంది.

Adavallu Meeku Joharlu: థర్డ్ సింగిల్.. సూపర్బ్ బ్యూటిఫుల్ మెలోడీ!

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇప్పటికే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కాగా.. ఈ మధ్యనే పుష్పతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి ఆశీస్సులు అందిస్తున్నాడు. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరవగా.. ఇప్పుడు ఈ సినిమాకు సుకుమార్ మరో సాయం చేశాడని మేకర్స్ ప్రకటించారు.

Aadavallu Meeku Joharlu Teaser: కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ చూపించే శర్వా!

ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా కోసం దర్శకుడు సుకుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బుకింగ్స్ మొదలు పెట్టగా.. ఈ శుక్రవారం ఆడవాళ్ళతో కలిసి శర్వా థియేటర్లకి రాబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక శరత్‌కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.