‘పిల్లా నాగుండెలోన ఇల్లే కట్టేసినావే’ : మహర్షి లిరికల్ సాంగ్

రీసెంట్‌గా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మహర్షి ఆల్బమ్ నుండి మరోసాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : April 29, 2019 / 06:26 AM IST
‘పిల్లా నాగుండెలోన ఇల్లే కట్టేసినావే’ : మహర్షి లిరికల్ సాంగ్

Updated On : April 29, 2019 / 6:26 AM IST

రీసెంట్‌గా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మహర్షి ఆల్బమ్ నుండి మరోసాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే  జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మిస్తున్న మహేష్ 25వ సినిమా, మహర్షి.. రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మహర్షి ఆల్బమ్ నుండి మరోసాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. ‘పాలపిట్టలో వలపు నీపైట మెట్టుపై వాలిందే’.. ‘పిల్లా నాగుండెలోన ఇల్లే కట్టేసినావే’.. అనే అయిదవ లిరికల్ సాంగ్ వినడానికి బాగుంది.

మాస్ ఆడియన్స్‌కి ఊపు తెప్పించేలా ఉన్న ఈ పాటకి శ్రీమణి లిరిక్స్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, ఎమ్‌ఎమ్ మానసి కలిసి పాడారు. మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని, పీపుల్స్ ప్లాజాలో, మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మహేష్‌తో పనిచేసిన దర్శకులందరూ ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవనున్నారు. మే 9న మహర్షి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

వాచ్ పాలపిట్ట లిరికల్ సాంగ్…