Jai Hanuman : ‘జై హనుమాన్’ పక్కన పెట్టేసి.. అనుపమతో సినిమా స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ..

'జై హనుమాన్' పక్కన పెట్టేసి అనుపమతో సినిమా స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ. ఆల్రెడీ 65 శాతం చిత్రీకరణ..

Jai Hanuman : ‘జై హనుమాన్’ పక్కన పెట్టేసి.. అనుపమతో సినిమా స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ..

Prashanth Varma starts movie with anupama parameswaran titled as Octopus

Jai Hanuman : తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘హనుమాన్’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 50 రోజులకు పైగా రికార్డు షోలు, 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టించింది. ఇక ఆ సినిమా చివరిలోనే సెకండ్ పార్టుకి లీడ్ ఇచ్చి భారీ అంచనాలు క్రియేట్ చేసారు. దీంతో ప్రేక్షకులంతా.. ఆ సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రశాంత్ వర్మ కూడా ఆ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ ని కూడా మొదలు పెట్టారు. దీంతో త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లి థియేటర్స్ లోకి తీసుకు వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఆ సినిమాని పక్కన పెట్టేసి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో సినిమా స్టార్ట్ చేశారట. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి.. 65 శాతం చిత్రీకరణ పూర్తీ చేసేశారని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఆ మూవీకి ‘ఆక్టోపస్’ అనే టైటిల్ ని కూడా పెట్టారట.

Also read : Devara : ‘దేవర’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన మరాఠీ హీరోయిన్..

ఇక ‘జై హనుమాన్’ని పక్కన పెట్టడానికి కారణం.. సినిమా కోసం ఎంచుకున్న నటీనటుల వలన అని సమాచారం. ఆ సినిమాలో హనుమంతుడిగా ఓ స్టార్ హీరో కనిపించబోతున్నారని ప్రశాంత్ వర్మ ఇప్పటికే తెలియజేసారు. మరి ఆ స్టార్ హీరో ఎవరు అన్నది మాత్రం తెలియదు గాని, ఆ హీరో వల్లే జై హనుమాన్ లేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ తో జై హనుమాన్ ఫ్యాన్స్ తెగ బాధ పడుతున్నారు.

ఇది ఇలా ఉంటే, హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. జై హనుమాన్ కూడా ఆ యూనివర్స్ లోనే రాబోతుంది. మరి ఇప్పుడు అనుపమతో రూపొందిస్తున్న ఆక్టోపస్ కూడా ఆ యూనివర్స్ లో భాగంగానే వస్తుందా..? లేదా..? అనేది ప్రశ్నగా మారింది.