Ram Charan : ఆస్కార్‌కి వెళ్లిన రాత్రి.. చరణ్ అండ్ ఎన్టీఆర్‌కి రాజమౌళి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.. ఎందుకో తెలుసా..?

ఆ ఆస్కార్ కి వెళ్ళినప్పుడు రాజమౌళి.. చరణ్ అండ్ ఎన్టీఆర్‌కి రాజమౌళి ఒక విషయం గట్టిగా చెప్పాడట. సరిగా చెప్పాలంటే గట్టి క్లాస్ పీకాడట. ఆ విషయాన్ని రామ్ చరణ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

Ram Charan : ఆస్కార్‌కి వెళ్లిన రాత్రి.. చరణ్ అండ్ ఎన్టీఆర్‌కి రాజమౌళి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.. ఎందుకో తెలుసా..?

Rajamouli warns Ram Charan and NTR at Oscar event RRR

Ram Charan : రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ (NTR) కలయికలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR ఆస్కార్ (Oscar) వరకు వెళ్లిన విషయం తెలిసిందే. నాటు నాటు (Naatu Naatu) పాటతో ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన చరణ్ అండ్ ఎన్టీఆర్.. ఆస్కార్ ని అందుకొని ఇండియా సినిమా హిస్టరీలో సంచలనం సృష్టించారు. అయితే ఆ ఆస్కార్ కి వెళ్ళినప్పుడు రాజమౌళి.. చరణ్ అండ్ ఎన్టీఆర్‌కి రాజమౌళి ఒక విషయం గట్టిగా చెప్పాడట. సరిగా చెప్పాలంటే గట్టి క్లాస్ పీకాడట. ఆ విషయాన్ని రామ్ చరణ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

Ram Charan : రామ్ చరణ్ కూడా మనలాగానే.. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఆ పని చేస్తాడంటా.. అదేంటో తెలుసా..?

రాజమౌళి చెప్పిన మాటలు ఏంటంటే.. “ఉదయం 7 గంటలకి అందరూ అల్లా రెడీగా ఉండాలి. ఇదేమి సౌత్ ఇండియా మీడియా లేదా బాలీవుడ్ మీడియా కాదు. ఆస్కార్ కి మనం మొదటిసారి వచ్చాము. ఏ కొంచెం మనం దొరికినా మీరేమన్నా హాలీవుడ్ సూపర్ స్టార్స్ అనుకుంటున్నారా? అని ఇక్కడ మీడియా మనల్ని ఏకిపారేస్తారు. అలాంటి మాటలు నేను వినకూడదు అనుకుంటున్నా. కాబట్టి త్వరగా పడుకొని, త్వరగా నిద్ర లేవండి” గట్టి వార్నింగ్ ఇచ్చాడట. కాగా రామ్ చరణ్ అక్కడ పలు ప్రముఖ హాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Netflix : నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారా? ఇకపై కష్టమే.. పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్ చేసిన నెట్‌ఫ్లిక్స్..

హాలీవుడ్ టాప్ స్టార్స్ పాల్గొనే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ పాల్గొని సంచలనం సృష్టించాడు. ఆ షోలో పాల్గొన్న మొదటి ఇండియన్ అవ్వడంతో అప్పటిలో ఆ విషయం బాగా వైరల్ అయ్యింది. ఇక ప్రస్తుతం చరణ్ నటిస్తున్న సినిమాలు విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.