Ram Charan: రామ్చరణ్ నిర్మాణంలో ఆ యువ హీరో సినిమా..?
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క సినిమాలను నిర్మిస్తున్నారు. చరణ్ తన చిన్ననాటి స్నేహితుడైన, యూవీ క్రియేషన్స్లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న విక్రమ్తో కలిసి 'వి మెగా పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క సినిమాలను నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని 2017లో ప్రారంభించాడు చరణ్. ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్ పాదర్’ వంటి చిత్రాలను ఈ సంస్థ ద్వారా నిర్మించారు. అయితే.. ఇటీవల చరణ్ తన చిన్ననాటి స్నేహితుడైన, యూవీ క్రియేషన్స్లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న విక్రమ్తో కలిసి ‘వి మెగా పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ బ్యానర్ ద్వారా టాలీవుడ్లో కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించనున్నట్లు ఆ సందర్భంగా ప్రకటించారు. తాజాగా ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా సక్సెస్లు అందుకున్న అభిషేక్ అగర్వాల్ సంస్థతో కలిసి వి మెగా పిక్చర్స్ ఓ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఇండియన్ కంటెంట్ను గ్లోబల్ ఆడియన్స్కి పరిచయం చేసేలా ఓ ప్రాజెక్టును చేయబోతున్నారు. మే 28 ఆదివారం ఉదయం 11.11 గంటలకు ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతుందని అంటూ ఓ వీడియో, పోస్టర్ విడుదల చేశారు.
Ram Charan : పాన్ ఇండియా నిర్మాతలతో ప్రాజెక్ట్ చేయబోతున్న చరణ్.. గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్!
దీంతో సినీ ప్రియుల్లో ఎక్కడ లేని అంచనాలు మొదలయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏంటి..? ఇందులో నటించబోయే హీరో ఎవరు..? అన్న దానిపై పలు ఊహాగానాలు వినపడుతున్నాయి. ఈ చిత్రంలో ‘కార్తికేయ2’ ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించనున్నాడని, ఈ సినిమాకి ‘ఇండియా గేట్’ అని పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారింది. మరీ ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
The hero steering this tale and changing the course of history ❤️🔥
Any guesses?
Announcement tomorrow at 11.11 AM 💥#RevolutionIsBrewing@AlwaysRamCharan @AbhishekOfficl @AAArtsOfficial pic.twitter.com/gzXvbedkuh
— V Mega Pictures (@VMegaPictures_) May 27, 2023
ప్రస్తుతం రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోండగా ఎస్జే సూర్య, నవీన్చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్చరణ్ తండ్రి, కొడుకుగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్లో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తైనట్లు సమాచారం. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ జూన్ రెండో వారంలో మైసూర్లో మొదలుకానుంది.
Ram Charan : హాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ని.. ఇండియా రావాలని కండిషన్ పెడతా.. రామ్చరణ్!