Shah Rukh Khan : నయనతార భర్తకు షారుఖ్ ఖాన్ వార్నింగ్.. ఆమెతో జాగ్రత్త..
బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)నటించిన సినిమా జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shah Rukh Khan warns to Vignesh Shivan : బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)నటించిన సినిమా జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. అలాగే సినీ సెలబ్రెటీలు సైతం ట్రైలర్ బాగుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా షారుక్ వాటికి రిప్లైలు ఇస్తున్నారు. కాగా.. నయనతార (Nayanthara) తో జాగ్రత్తగా ఉండమని ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) కు షారఖ్ ఖాన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
Rashmika : రష్మిక ఎన్ని భాషల్లో మాట్లాడగలదో మీకు తెలుసా..? ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..?
ఎందుకు అలా అన్నారంటే..?
జవాన్ చిత్ర ట్రైలర్పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. ఇలాంటి ఓ పెద్ద చిత్రంతో అట్లీ బాలీవుడ్లో అడుగుపెడుతున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో ట్రైలర్ ఉందన్నాడు. అలాగే షారుఖ్ ఖాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టాలనే తన భార్య నయనతార కల కూడా నెరవేరిందని చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
@VigneshShivN thank u for all the love. #Nayanthara is awesome…but oh who am I telling this…you toh already know!!! But Hubby, beware, she has now learnt some major kicks & punches!! pic.twitter.com/5aMZ8rzReN
— Shah Rukh Khan (@iamsrk) July 12, 2023
ఇది చూసిన షారుఖ్ ఖాన్ ఇలా రాసుకొచ్చాడు. “విఘ్నేష్ శివన్ మీ ప్రేమకు ధన్యవాదాలు. నయన్ అద్భుతమైన వ్యక్తి. కానీ.. నేను ఇది ఎవరితో చెబుతున్నాను. ఈ విషయం మీకు ఇప్పటికే తెలుసుకు కదా..!!! అయితే.. ఆమె ఇటీవల కొన్ని కిక్లు, పంచ్లు నేర్చుకుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.” అంటూ షారుఖ్ ఖాన్ అన్నాడు.
Ashish Vidyarthi : రెండో భార్యతో హనీమూన్లో ఆశిష్ విద్యార్థి..! ముసలోడే కానీ..
జవాన్ సినిమాతో లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్లో అరంగ్రేటం చేస్తోంది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించనుండగా, ప్రియమణి, అమృత అయ్యర్, సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి విలన్గా కనిపించనున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
MS Dhoni : సీఎస్కేలో చోటు కోరిన కమెడియన్.. ధోని రియాక్షన్ వైరల్