Tollywood Drug Case : ఈడీ ముందుకు రానా..ప్రశ్నించనున్న అధికారులు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. మనీ లాండరింగ్ ఎలా జరిగిందనేది దర్యాప్తు చేస్తున్న ఈడీ.. నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించనుంది.
Daggubati Rana : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. మనీ లాండరింగ్ ఎలా జరిగిందనేది దర్యాప్తు చేస్తున్న ఈడీ.. నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించనుంది. ఎక్సైజ్ సిట్ కేసు తెరపైకి రాని రానా పేరు ఈడీ విచారణలో తెరపైకి రావడంతో ఉత్కంఠ రేపుతోంది. ఈడీ నోటీసులు జారీ చేయడంతో తన వాదన వినిపించేందుకు వెళ్లనున్నారు రానా. ఎక్సైజ్ సిట్ దర్యాప్తులో రానా, రకుల్ ప్రీత్సింగ్ పేర్లు తెరపైకి రాలేదు. కానీ ఈడీ దర్యాప్తులో ఇద్దరి పేర్లు తెరపైకి రావడంతో విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రానా 2021, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం హాజరుకానున్నారు. కెల్విన్తో పరిచయం, ఎఫ్ క్లబ్ పబ్తో సంబంధాలపై రానాను ప్రశ్నించనుంది ఈడీ టీమ్.
Read More : Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. సెప్టెంబర్ 8న ఈడీ ముందుకు రానా
మరోవైపు…2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం నటుడు నందును సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ నెల 20వ తేదీన నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది కానీ ముందుగానే పిలిపించి పలు వివరాలు రాబట్టారు దర్యాప్తు బృందం అధికారులు. అయితే నందు ఈడీ ఆఫీసుకు వెళ్లేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మీడియాకు చిక్కలేదు. 10 గంటల పాటు నందును ప్రశ్నించింది ఈడీ. విచారణ పూర్తయ్యాక వెనుక నుంచి గేటు దూకి వెళ్లిపోయాడు నందు.
Read More : Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ సెలబ్రిటీస్.. రేపటి నుంచే విచారణ!
ఇప్పటివరకు సినీ ప్రముఖులనే విచారించిన ఈడీ…నిన్న తొలిసారి నిందితులనూ ప్రశ్నించింది. కెల్విన్ను తీసుకొచ్చి నగదు లావాదేవీలపై ఆరా తీసింది. ఐదు గంటలపాటు కెల్విన్ను విచారణ జరపింది. సినీ ప్రముఖులతో సంబంధాలు, డ్రగ్స్ కొనుగోళ్లు, బ్యాంకు లావాదేవీలను తెలుసుకుంది. డ్రగ్స్ కోసం విదేశాలకు నగదు తరలింపు, బ్యాంక్ అకౌంట్ లెక్కలను గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. కెల్విన్తో పాటు వేర్వేరు ప్రాంతాల నుంచి కుదూస్, వాహిద్లను ఈడీ కార్యాలయాలనికి భద్రత నడుమ తీసుకొచ్చి ప్రశ్నించారు అధికారులు.