Lok Sabha Seats : లోక్ సభ స్థానాల సంఖ్య 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్!

లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

Lok Sabha Seats : లోక్ సభ స్థానాల సంఖ్య 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్!

Pa

Updated On : July 26, 2021 / 7:15 PM IST

Lok Sabha Seats లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 2021 లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్డీయే సర్కార్ భావిస్తోందని అమృత్ సర్ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కొందరు తన సహచర బీజేపీ ఎంపీల ద్వారా  ఈ సమాచారం తెలిసినట్లు ఆయన సోమవారం ఓ ట్వీట్ లో తెలిపారు. కొత్త పార్లమెంట్ ఛాంబర్ ని కూడా 1000మంది కూర్చొనే సమార్థ్యం ఉండేలా నిర్మిస్తున్న విషయాన్ని మనీష్ తివారీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే పార్లమెంట్ స్థానాలను పెంచే ముందు దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ సీరియస్ గా జరగాలని తివారీ తెలిపారు. ప్రతిపాదిత ఐడియాలో మహిళలకి 1/3 వంతు రిజర్వేషన్ కూడా ఉన్నట్లు తెలిసిందని తివారీ తెలిపారు.

అయితే, లోక్ సభలో సీట్ల సంఖ్యను 1000కి పెంచాల్సిన అవసరముందని 2019లో దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే. రాజ్యసభలోనూ మరియు రాష్ట్రాల శాసనసభల్లో కూడా సీట్ల సంఖ్య పెంచాల్సిన అవరసముందని అప్పుడు ప్రణబ్ వ్యాఖ్యానించారు.