అనర్హత కర్ణాటక ఎమ్మెల్యేల “ఉప” పోటీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2019 / 06:35 AM IST
అనర్హత కర్ణాటక ఎమ్మెల్యేల “ఉప” పోటీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

Updated On : November 13, 2019 / 6:35 AM IST

కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ(నవంబర్-13,2019) సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఈ ఏడాది జులైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ రెబల్స్ అంతా 2023 వరకు సభాకాలం ముగిసే దాకా ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని కొట్టివేసింది. మళ్లీ పోటీ చేయడంపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేరని కోర్టు సృష్టం చేసింది.

జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి కారణమై,పార్టీ విప్‌ను ఉల్లంఘించారంటూ స్పీకర్ చేతిలో అనర్హతకు గురైన వారిలో కాంగ్రెస్ నుంచి 14 మంది, జేడీఎస్ నుంచి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 17 స్థానాల్లో 15 చోట్ల డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 18న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ. డిసెంబర్ 9, 2019న ఫలితాలు వెలువడనున్నాయి.