Five State Election : మంచి పనులు చెప్పండి, నాతో డిన్నర్ చేయవచ్చు.. కేజ్రీ ఆఫర్
తాము అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, తీసుకొచ్చిన మార్పులతో పాటు మంచి పనులను వీడియోలు తీయాలని సూచించారు. ఈ వీడియోలన్నీ ఎన్నికలు జరుగుతున్న...
Dinner With 50 Delhiites Kejriwal : ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆప్ పార్టీ. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతోంది. వినూత్నంగా ప్రచార కార్యక్రమాలకు తెరలేపారు ఆ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పంజాబ్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలే తెలియచేయాలంటూ ఓ ఫోన్ నెంబర్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ వాసులకు ఓ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, తీసుకొచ్చిన మార్పులతో పాటు మంచి పనులను వీడియోలు తీయాలని సూచించారు. ఈ వీడియోలన్నీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని వారికి పంపించాలని కోరారు.
Read More : Chittoor Dead Body : ముళ్లపొదల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతదేహం.. పరువు హత్యగా అనుమానం
బాగా వైరల్ అయిన వీడియోలు చేసిన వారిలో 50మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆ 50 మందిని తాను కలవడం జరుగుతుందని..అంతేగాకుండా…డిన్నర్ మీట్ లో పాల్గొంటానని చెప్పారు. ఢిల్లీలో చేసిన తాము మంచి పనులు ఇతర రాష్ట్రాల్లో చేయగలమని కేజ్రీవాల్ తెలిపారు.
Read More : AP Casino Issue : బుద్దా వెంకన్న అరెస్టు..
– ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 403 సీట్లు ఉండగా…ఏడు విడతల్లో పోలింగ్ జరుగనుంది.
– ఉత్తరాఖండ్ లో 70 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.
– పంజాబ్ రాష్ట్రంలో 117 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.
– గోవా రాష్ట్రంలో 40 సీట్లు ఉండగా…ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది.
– మణిపూర్ రాష్ట్రంలో 28 సీట్లు ఉండగా…రెండు విడుతల్లో (ఫిబ్రవరి 27, మార్చి 03) తేదీల్లో పోలింగ్ జరుగనుంది.