Ajit Pawars Plane Crash : మహారాష్ట్రలో విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు దుర్మరణం
Ajit Pawars Plane Crash : మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మరో ఆరుగురు మృతిచెందారు.
Ajit Pawars Plane Crash
Ajit Pawars Plane Crash : మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బరామతిలో అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో అజిత్ పవార్తో పాటు మరో ఐదుగురు ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో అజిత్ పవార్తోసహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
#WATCH | A plane crash reported in Baramati, Maharashtra. More details awaited.
Visuals from the spot. pic.twitter.com/xkx0vtY5cp
— ANI (@ANI) January 28, 2026
మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి పూణె జిల్లాలోని బారామతికి విమానంలో వెళ్తున్నారు. బరామతిలో పలు బహిరంగ సభలు, సమావేశాల్లో పవార్ హాజరు కావాల్సి ఉంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ అత్యవసరంగా విమానంను ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బరామతిలోని పంటపొలాల్లో విమానం కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే పెద్దెత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కానీ, మంటలు వ్యాపించడంతో అజిత్ పవార్తోపాటు మిగిలిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
Ajit Pawar’s Plane Crash Lands In Maharashtra’s Baramati. More details awaited. pic.twitter.com/geD8G9meXK
— Ashoke Raj (@Ashoke_Raj) January 28, 2026
