కుష్భూ తరపున అమిత్ షా ప్రచారం
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది.
Amit Shah తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. ఆదివారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సినీ నటి, బీజేపీ అభ్యర్థి కుష్బూ సుందర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కుష్బూ సుందర్ పోటీ చేస్తున్న థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం(ఏప్రిల్-3,2021) అమిత్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో కు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా డీఎంకే- కాంగ్రెస్ కూటమిపై అమిత్ షా నిప్పులు చెరిగారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే అవినీతిమయ డీఎంకే-కాంగ్రెస్ కూటమిని మరోసారి ఓడించాలని ఓటర్లకు అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కలలు నెరవేరుతాయన్నారు.
ASLO READ:నేను గెలిస్తే ప్రతి ఆడపిల్ల అకౌంట్ లో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తా : ఖుష్భూ
సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం చాలా చక్కగా పనిచేస్తున్నారని అమిత్ షా కితాబిచ్చారు. అందుకే ప్రజలు మరోసారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలని.. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కేంద్ర హోంమంత్రి పిలుపునిచ్చారు.
Union Home Minister and BJP leader Amit Shah holds a roadshow in Thousand Lights assembly constituency as he campaigns for the party’s candidate Khushbu Sundar.#TamilNaduElections2021 pic.twitter.com/hohWCwoG8O
— ANI (@ANI) April 3, 2021